సింహం సింగిల్‌గానే వస్తుంది.. వైఎస్ షర్మిల

0
66

తన అన్న సింహంలాంటోడని, అందువల్ల సింగిల్‌గానే వస్తాడని ఆయన సోదరి, వైకాపా మహిళా నేత వైఎస్. షర్మిల చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీ సింగిల్‌గా బరిలోకి బంపర్ మెజార్టీ సాధిస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయని ఆమె గుర్తుచేశారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసీపీ ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, సింహం సింగిల్‌గానే వస్తుందన్నట్టు వైసీపీ కూడా ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల బరిలో నిలిచిందని అన్నారు.

ప్రజలకు మంచి చేయాలంటే జగన్ అధికారంలోకి రావాలని, వెన్నుపోటు చంద్రబాబు పోవాలంటే, చెప్పింది చేసేవాడు కావాలంటే, రాజన్న రాజ్యం కావాలంటే తమ పార్టీకి ఒక్కసారి అవకాశమిచ్చి గెలిపించాలని, జగన్‌ని ముఖ్యమంత్రిని చేయాలని షర్మిళ కోరారు.

జాబు కావాలంటే బాబు రావాలని, బాబు వస్తే జాబు వస్తుందని అన్నారు కానీ, బాబు వస్తే కరవు వచ్చింది తప్ప ఉద్యోగాలు రాలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ‘బై బై’ చెబుదామని వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రానికి పచ్చ చొక్కాల రూపంలో పట్టిన పీడను వదిలించుకుందామని ఆమె పిలుపునిచ్చారు.