కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అందరినీ భయభ్రంతాలకు గురి చేస్తోంది. ఈ వైరస్ పెద్దా, చిన్నా, బీదా, గొప్ప, ఆడా, మగ అనే తేడా తెలియకుండా అందరినీ కమ్మేస్తోంది. ఈ వైరస్ సోకిన తర్వాత సరైన చికిత్స తీసుకోకపోతే మరణాన్ని ఆహ్వానించినట్టే. ఇప్పటికే లక్షల మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఇప్పటికే కొన్ని వేల మంది ఈ కరోనా కారణంగా కన్నుమూసారు. కొందరు సినిమా సెలబ్రిటీలకు కూడా ఈ వైరస్ సోకింది. ముఖ్యంగా హాలీవుడ్లో కొందరు హీరోలు, హీరోయిన్లు కూడా కరోనా బారిన పడ్డారు. కొందరు కన్నుమూసారు. తాజాగా హిందీ సీరియల్ ‘తబ్ కీ ప్యార్ కీ’ సీరియల్తో పాపులర్ అయిన ఇర్ఫాన్ కరోనా కారణంగా కన్నుమూసాడు. అతని మరణాన్ని తోటి నటి జయా భట్టాచార్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆరోగ్యం బాగాలేక హస్పిటల్లో జాయిన్ ఈయనకి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కరోనా సోకింది. అంతేకాదు సరైన సమయంలో తగిన చికిత్స కూడా చేయలేదు. హాస్పిటల్ వాళ్ల నిర్లిప్తత కారణంగా కన్నుమూసినట్టు చెప్పుకొచ్చింది. ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణించినట్టు తన ట్వీట్లో పేర్కొంది. ఒకవేళ సరైన చికిత్స అందించి ఉంటే బతికి ఉండేవాడని పేర్కొంది. ఈ సందర్భంగా టెడ్డీ బేర్లో ఉన్న అతనితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి అతనితో తన జ్ఞాపకాలను పంచుకుంది.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -