కరోనాతో మరో వర్ధమాన నటుడు కన్నుమూత.

0
377

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అందరినీ భయభ్రంతాలకు గురి చేస్తోంది. ఈ వైరస్ పెద్దా, చిన్నా, బీదా, గొప్ప, ఆడా, మగ అనే తేడా తెలియకుండా అందరినీ కమ్మేస్తోంది. ఈ వైరస్ సోకిన తర్వాత సరైన చికిత్స తీసుకోకపోతే మరణాన్ని ఆహ్వానించినట్టే. ఇప్పటికే లక్షల మంది ఈ మహమ్మారి బారినపడి ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఇప్పటికే కొన్ని వేల మంది ఈ కరోనా కారణంగా కన్నుమూసారు.  కొందరు సినిమా సెలబ్రిటీలకు కూడా ఈ వైరస్ సోకింది. ముఖ్యంగా హాలీవుడ్‌లో కొందరు హీరోలు, హీరోయిన్లు కూడా కరోనా బారిన పడ్డారు. కొందరు కన్నుమూసారు. తాజాగా హిందీ సీరియల్ ‘తబ్ కీ ప్యార్ కీ’ సీరియల్‌తో పాపులర్ అయిన ఇర్ఫాన్ కరోనా కారణంగా కన్నుమూసాడు. అతని మరణాన్ని తోటి నటి జయా భట్టాచార్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆరోగ్యం బాగాలేక  హస్పిటల్‌లో జాయిన్ ఈయనకి  వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కరోనా సోకింది. అంతేకాదు సరైన సమయంలో  తగిన  చికిత్స కూడా చేయలేదు. హాస్పిటల్ వాళ్ల నిర్లిప్తత కారణంగా కన్నుమూసినట్టు చెప్పుకొచ్చింది. ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణించినట్టు తన ట్వీట్‌లో పేర్కొంది.  ఒకవేళ సరైన చికిత్స అందించి ఉంటే బతికి ఉండేవాడని పేర్కొంది. ఈ సందర్భంగా టెడ్డీ బేర్‌లో ఉన్న అతనితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి అతనితో తన జ్ఞాపకాలను పంచుకుంది.