తెలంగాణ మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. పర్సనల్ సెక్రటరీలుగా ఇష్టమున్న వారిని నియమించుకోవద్దని.. వారిని తానే స్వయంగా అపాయింట్ చేస్తానని సీఎం కేసీఆర్ మంత్రులకు తెలిపారు.
ప్రతి మంత్రి దగ్గర ఒక పిఎస్, ఇద్దరు పిఏలు ఉంటారు. గతంలో మంత్రుల వద్ద పని చేసిన పిఎస్ లు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లనే మంత్రులు సరిగా పని చేయలేకపోయారని కేసీఆర్ గుర్తించడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఆశావహుల జాబితాను సీఎం కేసీఆర్ సిద్దం చేశారట. దానిని మంత్రులకు పంపించినట్టు సమాచారం. కేసీఆర్ ఈ విధంగా తిరకాసు పెట్టడంతో ఏం చేయాలో తోచక వారు తలలు పట్టుకున్నట్టు తెలుస్తోంది.సీఎం కేసీఆర్ ముఖ్యమైన శాఖలను తన వద్దే పెట్టుకున్నారు. ఈ సారి బడ్జెట్ ను కేసీఆరే ప్రవేశ పెట్టనున్నారని తెలుస్తోంది. ఏదేమైనా మంత్రులు ప్రమాణం చేసిన 24 గంటల్లోనే కేసీఆర్ వారి పై ఆంక్షలు విధించడం చర్చనీయాంశమైంది…