నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. దీనిపై సినీ నటుడు, వైకాపా నేత డాక్టర్ మోహన్ బాబు స్పందించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జగన్కు తన అభినందనలు అని చెప్పారు.
జగన్కు తన పదవీకాలంలో అంతా మంచే జరగాలి అని ఆశిస్తున్నట్టు చెప్పారు. జగన్ తన తండ్రి వైఎస్ఆర్ను మించి గొప్పవాడు అవుతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని పర్యాయాలు నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేస్తాడని మోహన్ బాబు జోస్యం చెప్పారు.