తెలిసిన వ్యక్తేనని పిలిచిన వెంటనే వెళ్లింది. కానీ ఆ దుర్మార్గుడు నమ్మి వచ్చిన మహిళపై స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కొత్తపేటకు చెందిన బాధిత మహిళ (32)కు ఐదేళ్ల క్రితం వివాహం కాగా, భర్తతో మనస్పర్థల కారణంగా రెండేళ్ల క్రితం విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటోంది.
వనస్థలిపురంలోని మ్యాక్స్లైన్ పాలసీ సంస్థలో పనిచేస్తూ జీవిస్తోంది. మన్సూరాబాద్కు చెందిన మనోజ్కుమార్ (30) ఆరు నెలల క్రితం బాధిత మహిళకు పరిచయం అయ్యాడు. ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలున్న మనోజ్తో మాట్లాడేందుకు వనస్థలిపురంలోని స్నేహమయనగర్కు వెళ్లింది.
అప్పటికే స్నేహితులతో కలిసి మందు కొట్టిన మనోజ్.. మద్యం మత్తులో ఉన్న మనోజ్ స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధిత మహిళ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మనోజ్ మరో ఐదుగురితో కలిసి తనపై అత్యాచారం చేసినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.