దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రం “సీత”. ఈ చిత్రం ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో యువ హీరో బెల్లకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.
గురువారం ఈ సినిమా ట్రైలర్ను మహర్షి సినిమాలో ప్రదర్శితమైంది. ఈరోజు ట్రైలర్ను ఆన్ లైన్లో విడుదల చేశారు. ప్రేక్షకుల నుండి ట్రైలర్కు అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. ‘నా పేరు సీత నేను గీసిందే గీత, ప్రాస బావుంది కదూ’ అంటూ కాజల్ అగర్వాల్ డైలాగ్ చెబుతుంది.
పైగా, ఇది పెద్ద కంచులా ఉందిరా! బాబూ అని తనికెళ్ల భరణి చెప్పే డైలాగ్ రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం తప్పు కాదండి. రాముడి భార్యను ఎత్తుకెళ్లడం తప్పు అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పే డైలాగ్.. ట్రైలర్లో ఆకట్టుకుంటున్నాయి.
బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఈ చిత్రంలో నెగటివ్ రోల్ చేస్తున్నారు. పాయల్ రాజ్పుత్ ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది. అనిల్ సుంకర నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు.