
పుల్వామా లో సీఆర్పీఎఫ్ జవాన్లపై నిన్న మధ్యాహ్నం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడి లో చాలా మంది జవాన్లు మరణించారు. ముందుగా ఐఈడీ బాంబుతో దాడి జరపగా.. అనంతరం తుపాకులతో కాల్పులకు జరిపారు. ఇది 2004 తరువాత జరిగిన అతిపెద్ద దాడి అని తెలుస్తోంది. సీఆర్పీఎఫ్ 54వ బెటాలియన్కి చెందిన జవాన్లు జమ్ము -శ్రీనగర్ హైవే మార్గంలో ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. ప్రస్తుత సమాచారం ప్రకారం 42మంది అమరులైనట్టు తెలుస్తోంది. ఈ దాడులకు పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ సంస్థ ప్రకటించింది.