సచిన్ ఆ రికార్డును చెరిపేసుకున్నారు… సెలూన్‌కి వెళ్లి షేవింగ్ చేయించుకున్నాడు…

0
57

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన ఉదారతను నిరూపించుకున్నాడు. తాజాగా ఇద్దరు అక్కాచెల్లెళ్ల కోసం నిస్వార్థంగా ముందుకొచ్చిన వైనం ప్రశంసలు అందుకుంటోంది. బార్బర్ షాప్ గర్ల్స్‌‌కు సచిన్ సహకరించాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిని నేహా, జ్యోతి అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు మగవారికి మాత్రమే పరిమితం అనుకోకుండా సొంతంగా బార్బర్ షాప్ పెట్టారు. మగవారికి షేవింగ్ చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షించారు.

ప్రఖ్యాత షేవింగ్ ఉపకరణాల సంస్థ జిల్లెట్ కూడా వీరికి తనవంతు ప్రచారం కల్పించింది. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా ఆ అక్కాచెల్లెళ్లను ప్రోత్సహించే క్రమంలో వారి సెలూన్‌కు వెళ్లి షేవింగ్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఈ బార్బర్ షాప్ గర్ల్స్ వద్దకు సచిన్ వెళ్లడానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అసలు విషయం ఏమిటంటే.. సచిన్ ఇప్పటివరకు ఎక్కడా బయట షేవింగ్ చేయించుకోలేదు. ఆ విషయం తనే స్వయంగా చెప్పారు. ఆ రికార్డు నేడు చెరిగిపోయిందని తెలిపాడు. బార్బర్ షాప్ గర్ల్స్‌‌ను కలిసే కార్యక్రమంలో భాగంగా వారితో షేవింగ్ చేయించుకున్నాను. జిల్లెట్ సంస్థ ఇస్తున్న స్కాలర్ షిప్‌ను వారికి అందించానని ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పారు.

యూపీలోని బన్వారీ తోలా అనే ప్రాంతంలో నివసించే నేహా, జ్యోతి తండ్రికి ఆసరాగా ఉండడం కోసం తాము కూడా క్రాఫింగ్, షేవింగ్ నేర్చుకున్నారు. ఓవైపు చదువుకుంటూనే సెలూన్‌లో పనిచేయడం కొనసాగించారు.