మరాఠీ సింగర్ గీతా మాలి మృతి.

0
54

మరాఠీ సింగర్ గీతా మాలి మహారాష్ట్రలోని థానేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. గురువారం తెల్లవారుజామున 3గంటలకు ఆమె ప్రయాణిస్తున్న కారు.. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ కంటైనర్‌ను ఢీకొట్టింది.ప్రమాదంలో గీతా మాలి,ఆమె భర్త తీవ్ర గాయాలపాలయ్యారు. ఇద్దరిని హుటాహుటిన సమీపంలోని షాపూర్ రూరల్ ఆస్పత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ గీతా మాలి కన్నుమూశారు. ఆమె భర్త పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. అమెరికా నుంచి తిరిగొచ్చిన ఆమె తన స్వగ్రామం నాసిక్‌కి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.కాగా,గీతా మాలి పలు మరాఠీ సినిమాల్లో పాటలు పాడారు. అలాగే పలు సొంత ఆల్బమ్స్ కూడా రూపొందించారు.