టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసులో మరో ట్విస్ట్.

0
49

టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసిర మనోహర్ రెడ్డి సోదరి రాధ కుటుంబం కారు ప్రమాదం కేసు కొత్త మలుపు తిరిగింది. అల్గునూర్ వద్ద కాకతీయ కాల్వలో కారు పడిన ఘటన ప్రమాదం కాదని.. ఆత్మహత్య అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ అనుమానాలకు బలం చేకూర్చే ఆధారాన్ని పోలీసులు సేకరించారు. కేసు దర్యాప్తు సమయంలో రాధ భర్త సత్యనారాయణ రెడ్డి ఫర్టిలైజర్ షాపులో డైరీ దొరికింది. ప్రమాదానికి ముందే తన ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి అప్పగించాలని డైరీలో రాసుకున్నారు. ఈ నేపథ్యంలో వారు ఖచ్చితంగా ఆత్మహత్యే చేసుకున్నారని భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు తెలిసే అవకాశముంది.

ఇటీవల కాకతీయ కెనాల్‌లో దాసరి మనోహర్‌రెడ్డి కారు బయటపడింది. అందులో మనోహర్ రెడ్డితో పాటు అతడి భార్య రాధ, కుమార్తె వినయశ్రీ మృతదేహాలు లభించాయి. ప్రమాదం జరిగిన 21 రోజుల తర్వాత ఆ ఘటన వెలుగులోకి వచ్చింది. కాకతీయ కాలువలో గల్లంతైన ఓ మహిళకోసం వెతుకుతుండగా.. అనుకోకుండా ఈ కారు కారు బయటపడింది. పోలీసులు క్రేన్‌తో కారును బయటకు తీయగా వీరి శవాలు కుళ్లిన స్థితిలో దర్శనమిచ్చాయి. ఆ మృతదేహాలకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం స్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.